సుమారు రూ.1లక్ష విలువ గల 5 కేజీ ల గంజాయి స్వాధీనం.
రేణిగుంట రోడ్డు ఫ్లై ఓవర్ దగ్గర పోస్టల్ కాలనీ క్రాస్ వద్ద తనిఖీలు చేస్తుండగా పట్టివేత.
ఎన్.డి.పి.ఎస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు.
జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడి.
అరెస్టయిననిందితుల వివరాలు:-
A1.సాయికృష్ణ ,
థానేలి గ్రామం, సూళ్లూరు పేట మండలం.
ప్రస్తుత నివాసం: 5వ లేన్, SLV నగర్, గ్రాండ్ వరల్డ్ దగ్గర, తిరుపతి.
A2. మునిచెర్ల సాయి ,
రాగిమాను పెంట గ్రామం, బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా.
ప్రస్తుత నివాసం: అవిలాల పంచాయతీ, తిరుపతి.
కేసు వివరాలు:- శుక్రవారం నాడు ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు వివరాలను గురించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి గారు విలేకరులకు వివరించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., జిల్లా వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచాలని ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీసులు తిరుపతి పట్టణం లోని రేణిగుంట రోడ్డు ఫ్లైఓవర్ పోస్టల్ కాలనీ క్రాస్ వద్ద foot పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కదలికలు ఉన్న ఈ ముద్దాయిలు ఇద్దరిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద 5 కేజీల గంజాయి లభించిందన్నారు.
వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పాడేరు నుంచి ఈ గంజాయిని కొనుగోలు చేసి నగరానికి తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి తిరుపతి నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు.
ఇరువురిపై ఎన్.డి.పి.ఎస్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి ఈస్ట్ సీఐ తెలిపారు.
Our Citizen Reporter – Telangana
Mr. Bharath Reddy