ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈరోజు సిఏ ఆర్ హెడ్ క్వార్టర్ లో ఏఆర్ సిబ్బంది అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
గత నాలుగైదు రోజుల క్రితం ఆకుల నరేష్ ఏఆర్ కానిస్టేబుల్ చనిపోవడం దురదృష్టకరమైన సంఘటన అని తెలిపారు. ఈ సంఘటన అందరినీ ఎంతో దిగ్భంథికి గురిచేసిందన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలన్నారు. తల్లిదండ్రులను కుటుంబాన్ని విధి నిర్వహణను సమానంగా చూసుకొని బ్యాలెన్స్ జీవితం గడపాలన్నారు. మనం మన కుటుంబం మన పిల్లలు సంతోషంగా జీవించడం చాలా ముఖ్యమన్నారు. మానవ జీవితంలో నలుగురు మెచ్చుకునేలా జీవించాలని,
ఉద్యోగం సాధించడానికి ఎంతో కష్టపడి చిన్నప్పటినుండి చదువుకొని ఎంతో కష్టపడితే తప్ప ఈ ఉద్యోగం రాదన్నారు. ఎన్నో పరీక్షలలో నెగ్గిన తర్వాత ఉద్యోగం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.
శిక్షణా కాలంలో మనసు శరీరం మైండ్ ఏకం చేసి మనకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో క్రమశిక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. విధినిర్వహణలో కానీ జీవితంలో కానీ క్రమశిక్షణ తప్పితే జీవితం ఎలా మారుతుందో సమాజంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా పోలీస్ డిపార్ట్మెంట్ నిలుస్తుందన్నారు.
ప్రతి ఒక్కరూ రోల్ మోడల్ గా నలుగురికి ఆదర్శంగా జీవించాలని సూచించారు.
తల్లిదండ్రులను భార్య పిల్లలను గురువులను ఎప్పుడూ ప్రేమించాలన్నారు.
టెక్నాలజీ మంచి గురించి వినియోగించుకోవాలని తెలిపారు. మంచి చెడులు మన మనసుపై ఆధారపడి ఉంటాయని మనసును నిలకడగా ఉంచుకొని మంచి వైపు ప్రయాణించి నలుగురిలో ఆదర్శంగా ఉండాలని సూచించారు. జీవితం విలువ డబ్బు విలువ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలన్నారు. టెక్నాలజీ మంచి గురించి వాడుకోవాలన్నారు. చిన్నప్పటినుండి అందరూ కష్టపడి చదివి ఉద్యోగం సాధించుకున్నామని గుర్తెరిగి ముందుకు సాగాలన్నారు.
ఉద్యోగం రాకముందు మన జీవించిన జీవితం మనం కష్టపడ్డ ప్రతిక్షణం రోజుకు ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. విధి నిర్వహణను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఈ రోజుల్లో ఒక్క సెల్ ఫోన్ నెంబర్ తో మనిషి యొక్క జాతకం మొత్తం బయటపడుతుందన్నారు. సెల్ఫోన్ ద్వారా ఏం చేస్తున్నాడు ఏం చూస్తున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ప్రయాణిస్తుందన్న విషయాలు వెంటనే తెలుసుకోవచ్చన్నారు. టెక్నాలజీ తో స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించే దిశగా ప్రయాణించాలని సూచించారు. పిల్లలను కష్టపడి చదివించి ఐఏఎస్ లు ఐపీఎస్ లు సాధించిన వారు ఉన్నారన్నారు, ఆస్ట్రేలియా అమెరికా ఇతర దేశాలలో ఎంతోమంది కానిస్టేబుల్ కొడుకులు కూతుర్లు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అందరం ఒక కుటుంబం లాగా విధి నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. పిల్లలను ఉన్నతంగా చదివించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఉన్నత అధికారులకు వెంటనే తెలియపరచాలని సూచించారు. ఆవేశంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి అవార్డులు రివార్డులు అందజేస్తామని తెలిపినారు. పోలీస్ ఉద్యోగ రిత్యా ఒత్తిడి వుంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి సిబ్బంది ప్రతిరోజూ రన్నింగ్, వాకింగ్, యోగా, సైక్లింగ్ చేయాలని,
సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచందర్రావు,
రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, ప్రసాద్, శ్రీనివాస్, రాజేష్, ఆర్ఎస్ఐలు రోహిత్, రంజిత్, సురేష్, వెంకటరమణ, బాలకృష్ణ, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Our Citizen Reporter – Telangana
Mr. Bharath Reddy